Article Body
యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలకు తాత్కాలిక విరామం.. కొత్త సర్వీస్ ప్రొవైడర్కు బాధ్యతలు
యూఏఈలో భారతీయులకు అందిస్తున్న పాస్పోర్ట్, వీసా, ఇతర కాన్సులర్ సేవలు జూన్ 26 నుంచి ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అబుధాబీలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. కాన్సులర్ సేవలను కొత్త సర్వీస్ ప్రొవైడర్కు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగానే ఈ విరామం ఉంటుందని వెల్లడించింది.
జులై 1 నుంచి అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ పాస్పోర్ట్, వీసా సేవల నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. ప్రస్తుతం సేవలు అందిస్తున్న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ మరియు ఎస్జీఐవీఎస్ గ్లోబల్ సంస్థలు జూన్ 25 తర్వాత కొత్త దరఖాస్తులను స్వీకరించబోవని ఎంబసీ స్పష్టం చేసింది.
అయితే అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన పాస్పోర్ట్, వీసా సేవలను అబుధాబీలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం కొనసాగించనున్నట్లు తెలిపింది. అత్యవసర సహాయం అవసరమైన వారు ఫోన్, వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా సంబంధిత భారతీయ దౌత్య కార్యాలయాలను సంప్రదించవచ్చని సూచించింది.

Comments