విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ రైలు!
సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ప్రయాణికులకు ఒక శుభవార్త అందించింది. విశాఖపట్నం నుండి బెంగళూరు సిటీకి నూతన వందే భారత్ స్లీపర్ ట్రైన్ను నడపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ రైలు విశాఖలో బయలుదేరి దువ్వాడ, విజయవాడ, గుంటూరు మరియు నంద్యాల మీదుగా బెంగళూరు సిటీకి చేరుకుంటుంది. ఈ అత్యాధునిక స్లీపర్ రైలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మారనుంది.