Article Body
భారతదేశంలో రద్దీకి చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ (eVTOL) రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ 'ది ఈప్లేన్ కంపెనీ' తమ సరికొత్త ప్రయాణికుల ఎయిర్ టాక్సీ e200X పూర్తిస్థాయి ప్రొటోటైప్ను ఆవిష్కరించింది.
ముఖ్యమైన ప్రత్యేకతలు:
-
సామర్థ్యం: ఇందులో ఒక పైలట్ సహా ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ప్రయాణికులు లేనప్పుడు 200 కిలోల వరకు సరుకులను మోసుకెళ్లగలదు.
-
పరిధి & వేగం: సింగిల్ ఛార్జింగ్తో దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
-
స్థల వినియోగం: కేవలం 8 × 11 మీటర్ల పరిమాణంతో ఉండే ఈ ఎయిర్ టాక్సీని, పెద్ద వర్టిపోర్టులు అక్కర్లేకుండా సాధారణ హెలిప్యాడ్లు లేదా భవనాల కప్పుల నుంచే టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయవచ్చు.
-
డిజైన్: మెరుగైన భద్రత మరియు సులభమైన నిర్వహణ కోసం ఇందులో 8 ఫిక్స్డ్ వర్టికల్-లిఫ్ట్ ప్రొపెల్లర్లను అమర్చారు.
ప్రస్తుతం ప్రొటోటైప్ దశలో ఉన్న ఈ ఎయిర్ టాక్సీ.. భద్రతా పరీక్షలు మరియు డీజీసీఏ (DGCA) అనుమతులు పొందిన తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది

Comments