తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ
తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అర్హులైన ఒంటరి మహిళలు మరియు వితంతువులకు ఆగస్టు 15వ తేదీ నుండి కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రభుత్వం పారదర్శకంగా చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. చాలా కాలంగా పెన్షన్ల కోసం నిరీక్షిస్తున్న లబ్ధిదారులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.