సుప్రీంకోర్టులో విద్యార్థుల అరెస్టు: గౌరవం కాపాడటం అందరి బాధ్యత
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయ విద్యార్థులను (ప్రభల్ ప్రతాప్ సింగ్, చందర్ భాన్) దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. జులై 10న జరిగిన ఈ ఘటనలో ప్రభల్ ప్రతాప్ కోర్టులో గందరగోళం సృష్టించి, భద్రతా సిబ్బంది విధులకు ఆటంకం కలిగించాడు.
అయితే, నిందితులపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారు తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నారని పేర్కొంటూ, ఈ ఘటన పట్ల సానుభూతి వ్యక్తం చేసింది. ‘‘యువత కొన్ని సందర్భాల్లో ఇలా ప్రవర్తిస్తారు. ఈ ఘటనను పెద్దది చేయాల్సిన అవసరం లేదు, అయితే రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడడం అందరి బాధ్యత’’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.