Article Body
జూలై 1 నుండి భారీ మార్పులు: మీ జేబుకు చిల్లు ఖాయమా? పూర్తి వివరాలు ఇవే!
ప్రతి నెల మొదటి తేదీన కొత్త నిబంధనలు అమల్లోకి రావడం సహజం. అయితే, ఈసారి జూలై 1 నుంచి సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం:
1. పాస్పోర్ట్ ఫీజు పెంపు: పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఫీజులను గణనీయంగా పెంచారు.
-
సాధారణ పాస్పోర్ట్ (36 పేజీలు): రూ. 1,500 నుంచి రూ. 2,500కి పెంపు.
-
తత్కాల్ పాస్పోర్ట్: రూ. 3,500 నుంచి రూ. 5,000కి పెంపు.
-
60 పేజీల పాస్పోర్ట్: రూ. 3,500 నుంచి రూ. 6,000కి పెంపు.
-
పాడైపోయిన/పోయిన పాస్పోర్ట్: రూ. 1,750 నుంచి రూ. 4,250కి పెంపు.
2. ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డ్ నిబంధనలు: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్లో బ్యాంక్ మార్పులు చేసింది. ఇకపై రివార్డ్ పాయింట్లపై పరిమితులు (Limits) అమలులోకి రానున్నాయి.
3. ఆధార్ ఉచిత అప్డేట్: ఆధార్ వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త. ఆధార్లో వివరాలు అప్డేట్ చేసుకునేందుకు గతంలో ఉండే రూ. 75 ఫీజును, జూలై 1 నుంచి ఆరు నెలల పాటు యుఐడిఏఐ (UIDAI) మాఫీ చేసింది.
4. ఆర్బీఐ కొత్త నిబంధన: బ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టించేలా విక్రయిస్తుంటే, వాటిని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలు తెచ్చింది. ఒకవేళ వినియోగదారులు తప్పుదోవ పట్టించే ఉత్పత్తులను కొనుగోలు చేస్తే, వారు పూర్తి రీఫండ్ లేదా నష్టపరిహారం పొందే అవకాశం కల్పించింది.
5. గ్యాస్ మరియు ఇంధన ధరలు: ప్రతి నెలా మొదటి తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. ఈసారి కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా. అలాగే, పెట్రోల్, డీజిల్ ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది.

Comments