‘వదలా’ చిత్రాన్ని ఎవరూ ట్రోల్ చేయరు: జగపతి బాబు
నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వదలా’. ఆకెళ్ల వి.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జగపతి బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని, దీనిని ఎవరూ ట్రోల్ చేయరని పేర్కొన్నారు.
కొన్ని సినిమాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం సరికాదని, నెగటివిటీని వదిలి ఇండస్ట్రీని కాపాడే దిశగా అందరూ సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమా మేకింగ్ ప్రక్రియలో వస్తున్న సవాళ్లను వివరించారు. ఈ చిత్రంలో లయ, హృతికా శ్రీనివాస్ ముఖ్యపాత్రలు పోషించారు.