హర్యానాలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం
భారతదేశం పర్యావరణహిత రవాణా వైపు మరో అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు హర్యానాలో త్వరలో పట్టాలెక్కనుంది. ఈ అత్యాధునిక రైలు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుంది. గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.