ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన అడవులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీడ్ బాల్స్ (విత్తన బంతులు) పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. మనుషులు వెళ్లలేని దుర్ఘమ ప్రాంతాల్లోనూ పచ్చదనం పెంపొందించేందుకు డ్రోన్ల సహాయంతో సీడ్ బాల్స్ జారవిడుస్తున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 63 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇందులో దాదాపు వెయ్యి ఎకరాల్లో కేవలం డ్రోన్ల ద్వారానే విత్తనాలను చల్లారు. రాజమహేంద్రవరం, విశాఖ, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.
ముఖ్య ఆదేశాలు:
-
వర్షపాతం మరియు నేలలో తేమను బట్టి సీడ్ బాల్స్ పంపిణీని వేగవంతం చేయాలి.
-
అవసరమైన చోట డ్రోన్ల సంఖ్యను పెంచి, లక్షిత 30 వేల హెక్టార్ల ప్రణాళికను సకాలంలో పూర్తి చేయాలి.
-
సీడ్ బాల్స్ చల్లడంతో సరిపెట్టకుండా, వాటి నుంచి వచ్చే మొలకల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి.