News Blog Fact Check Press Release Jobs Event Product FAQ Local Business Lists Live Music Recipe

అటవీ పునరుద్ధరణకు డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్

ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన అడవులను పునరుద్ధరించేందుకు డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

Published on


ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన అడవులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీడ్ బాల్స్ (విత్తన బంతులు) పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. మనుషులు వెళ్లలేని దుర్ఘమ ప్రాంతాల్లోనూ పచ్చదనం పెంపొందించేందుకు డ్రోన్ల సహాయంతో సీడ్ బాల్స్ జారవిడుస్తున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 63 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇందులో దాదాపు వెయ్యి ఎకరాల్లో కేవలం డ్రోన్ల ద్వారానే విత్తనాలను చల్లారు. రాజమహేంద్రవరం, విశాఖ, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.

ముఖ్య ఆదేశాలు:

  • వర్షపాతం మరియు నేలలో తేమను బట్టి సీడ్ బాల్స్ పంపిణీని వేగవంతం చేయాలి.

  • అవసరమైన చోట డ్రోన్ల సంఖ్యను పెంచి, లక్షిత 30 వేల హెక్టార్ల ప్రణాళికను సకాలంలో పూర్తి చేయాలి.

  • సీడ్ బాల్స్ చల్లడంతో సరిపెట్టకుండా, వాటి నుంచి వచ్చే మొలకల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి.

Want to engage with this content?

Like, comment, or share this article on our main website for the full experience!

Go to Main Website for Full Features

తెలుగు న్యూస్ అలర్ట్స్ టీమ్

రాజకీయ & వినోద వార్తల సంపాదక బృందం

తెలుగు న్యూస్ అలర్ట్స్ సంపాదక బృందం రాజకీయాలు, వినోదం, టాలీవుడ్, సెలబ్రిటీ వార్తలు మరియు బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా, వేగంగా పాఠకులకు అందిస్తుంది.

More by this author →

తెలుగు న్యూస్ అలర్ట్స్ | తాజా రాజకీయ & వినోద వార్తలుతెలుగు న్యూస్ అలర్ట్స్‌లో తాజా రాజకీయ వార్తలు, సినీ వార్తలు, సెలబ్రిటీ అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక కథనాలు మరియు తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలను చదవండి.

👉 Read Full Article on Website